Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : ఏపీ సీఎం జగన్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత చికిత్సను అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుని, వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
 
ముఖ్యంగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా విశాఖలో రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారికి అండగా నిలబడటమే కాకుండా క్షతగాత్రులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments