Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి చుక్కలు.. ఎమ్మెల్యేలకు గాలం.. కేసీఆర్ పక్కా ప్లాన్.. ఏంటది?

Written By సెల్వి
Updated: శనివారం, 29 అక్టోబరు 2022 (15:15 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి చుక్కలు చూపించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారని సమాచారం. తెలంగాణలో బీజేపీని నామరూపాలు లేకుండా చేసే మరో అరుదైన అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. నలుగురు కాదు నలభై మంది టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు టచ్‌లో తమతో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా బాహాటంగా బీజేపీ చెప్తూ వస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు బీజేపీ సన్నిహితులు, నలుగురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో జరిపిన బేరసారాలని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. డీల్‌కు పక్కా సాక్ష్యాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెద్ద వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. 
 
కేసీఆర్ వ్యూహాలు వేరే ఉన్నాయట. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్న తరుణంలో దొరికిన ఈ డీల్ ఆధారాలను జాతీయ స్థాయిలో బయటపెట్టి, బీజేపీని జాతీయస్థాయిలో దెబ్బ తీసే అరుదైన అవకాశం ఉందని టాక్ వస్తోంది. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టడంకంటే ఢిల్లీలో పెడితే ఆశించినంత పొలిటికల్ మైలేజీ వస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పడంతో కేసీఆర్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు టాక్.
 
అందుకే హైదరాబాద్ ప్రెస్ మీట్ రద్దయిందని, ఒకటి రెండు రోజుల్లో అన్నిజాతీయ మీడియా ఛానెళ్లతో పాటు ఇంగ్లీష్ ఛానళ్లను కూడా రప్పించి ఢిల్లీలో కేసీఆర్ భారీ ప్రెస్ మీట్ ఉండనున్నట్టు సమాచారం.

అన్నీ చూడండి

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత

మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments