రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న ఎంతో కాలం సాగ‌దు: ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు

బుధవారం, 28 జులై 2021 (15:22 IST)
MP రాక్షసత్వపు రాజకీయాలని తెలుగునాట పెంచి పోషిస్తున్న వైసీపీ పాలనలో మరో మైలురాయి నమోదయ్యింద‌ని టీడీపీ ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు అభివ‌ర్ణించారు. ఏపీలో నానాటికి పెరుగుతున్న అరాచకత్వం పతాక స్థాయికి చేరింద‌ని, దేవినేని ఉమాపై జరిగిన దాడి దురదృష్టమే కానీ అందులో ఆశ్చర్యం లేద‌న్నారు.

విధ్వంసాలు తప్ప, పరిపాలన చేతకాని ఈ ప్రభుత్వం నుండి ఇంత కన్నా ప్రజలు ఏం ఆశించగలరు? అని ప్ర‌శ్నించారు. వైసీపీ గూండాలు చేస్తున్న దుర్మార్గాలు, పిరికిపంద చర్యలకు మేం భయపడం!

మా కార్యకర్తలకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి జవాబు చెప్పే రోజు దగ్గరలోనే ఉంద‌న్నారు. దుర్మార్గం, అరాచకత్వం, రాక్షసత్వం, విధ్వంసం... ఈ నాలుగు స్తంభాలే ఆధారంగా వైసీపీ కడుతున్న సామ్రాజ్యం ఎంతో కాలం సాగబోద‌ని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

అన్నీ చూడండి

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments