1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (10:11 IST)

టోక్యో ఒలింపిక్స్ : పీవీ సింధు ఖాతాలో రెండో విజయం

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-జెలో హాంకాంగ్ క్రీడాకారిణి చెయుంగ్ ఎన్‌గాన్ యితో జరిగిన పోరులో రియో రజతపతక విజేత సింధు 2-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వార్టర్స్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. 
 
ఇదిలావుంటే, మహిళల హాకీలో భారత జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. పూల్-ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం పాలైంది. ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 
 
ఎలిమినేషన్స్ రౌండ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షానీ చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్‌లో రోయింగ్ జంట అర్జున్‌లాల్ జాట్-అర్వింద్ సింగ్ జోడీ 6: 24.41 రేసును పూర్తిచేసి ఫైనల్ బికి చేరుకుంది.