Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి నాడు.. యజర్వేదాన్ని పారాయణం చేస్తే..?

Updated: సోమవారం, 4 మార్చి 2019 (11:44 IST)
ఈశ్వరుని ప్రార్థనలో ముఖ్యమైన రోజు మహాశివరాత్రని చెప్పొచ్చు. ఈ రోజున పద్నాలుగు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం చేసి ఒక్క బిల్ల పత్రాన్నైనా పరమేశ్వరునికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండింతులు పేర్కొంటున్నారు.
 
అంతేకాదు, ఈ రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలానే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కూడా చేస్తారు.
 
మొదటి యామం:
పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామివారికి అర్చన చేస్తారు. అలానే నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఈ పూజలో స్త్రీలు రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
 
రెండవ యామం:
ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత గులాబీ నీరు, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్పపత్రాలు, తులసితో అర్చన చేస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ పూజలో ఈ పారాయణం చేయడం వలన సంతానం ప్రాప్తి కలుగుతుంది.
 
మూడవ యామం:
ఇందులో స్వామివారికి తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధం లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లె పువ్వులతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట. 
 
నాలుగవ యామం: 
చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పువ్వులు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామ, కలువ, మల్లె పువ్వులతో అర్చన చేసి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments