బెడ్‌రూమ్‌కు స్మార్ట్ ఫోన్లు వద్దు.. హాలుకే పరిమితం చేస్తే?

ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం గడపలేని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు స్మార్ట్ ఫోన్లను తెగవాడేసే వారు అధికమవుతున్నారు. అయితే స్మార్ట

Written By selvi
Updated: గురువారం, 5 జులై 2018 (11:25 IST)
ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం గడపలేని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు స్మార్ట్ ఫోన్లను తెగవాడేసే వారు అధికమవుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ రేడియోషన్ ద్వారా ముప్పు పొంచి వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే  నిత్య‌జీవితంలో వైర్‌లెస్ క‌నెక్టివిటీ ఒక భాగమైపోయింది. 
 
సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లు, వై ఫై టెక్నాల‌జీ, రిమోట్ వ‌ర్కింగ్ వంటి విధానాల వ‌ల్ల తెలియ‌కుండానే మన ఆరోగ్యం వైర్‌లెస్ సిగ్నళ్ల రేడియేషన్‌కి గురవుతుంది. ఇలా చాలాకాలం పాటు రేడియేషన్‌కు మానవ శరీరం గురవడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్, ఇన్‌ఫెర్టిలిటీ వంటి సమస్యలతో పాటు అంతుచిక్కని రోగాలు వచ్చే ఛాన్సుందని వైద్యులు చెప్తున్నారు. రేడియేషన్ ప్రభావం కారణంగా ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన రుగ్మతలు తప్పవట. 
 
రోజురోజుకీ వైర్‌లెస్ రేడియేష‌న్ త‌రంగాల సాంద్ర‌త పెరుగుతోంద‌ని.. తద్వారా అంతు చిక్కని రోగాలు మానవాళిని వెంబడిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట స్మార్ట్ ఫోన్లను పడక గదికి తేవడం కూడదని.. హాలులోనే వాటిని పరిమితం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. 
 
రింగ్ టోన్‌ వాల్యూమ్ పెంచేసి హాలులో స్మార్ట్ ఫోన్లను వుంచడం ద్వార పిల్లల్లో రేడియేషన్ ప్రభావం చాలామటుకు తగ్గుతుంది. అలాగే పడకగదిలో వైఫై వంటి టెక్నాలజీ ఉపయోగించే పరికరాలు వుండకపోవడం చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments