ఈ కారణాల వల్లే నిద్రకు దూరమవుతున్న యువత...

సోమవారం, 4 నవంబరు 2019 (10:47 IST)
చాలా మంది వివిధ రకాల పనుల ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గనుక ఇంకా కుంగిపోవడం ఖాయం కాబట్టి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి.
 
కనీసం గంట నుంచి అరగంట వరకూ నిద్రపోయేలా చూసుకోండి. దాని ఫలితంగా ఆందోళన తగ్గుతుంది. తర్వాత మీరే ఉత్సహంగా ఉంటారు. మీరు స్నేహితులతో కాసేపు గడిపి చూడండి ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.
 
మీరు బాగా ఆనందంగా ఉన్న సందర్భాలనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితులూ ఊహించుకోండి. దాంతో మీ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ఇలా చేయడం వల్ల మనసే కాదు శరీరానికీ విశ్రాంతి అందటంతో పాటు ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.
 
కొన్నిసార్లు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా ఆందోళన పెరిగిపోతుంది. మీరలా ఊహించుకునేవారైతే ఆ ఆలోచనలు పక్కనపెట్టి ఏదైనా పనిలో పడండి. వీలైనంత ఎక్కువసేపు పనిచేసేలా చూసుకోవడం వలన ఆందోళన ఉండదు. 
 
ఒక్కోసారి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా కంగారుగా, ఆందోళనగా అనిపిస్తుంటుంది. అందువలన మీరు మరుసటి రోజూ చేయాల్సిన పనుల్ని ముందే రాసి పెట్టుకోండి. వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. ఒకటి రెండు రోజులు మీ దినచర్య నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీకు బాగా ఇష్టమైన పని చేసేలా చూసుకోవడం వల్ల ఆందోళను దూరం చేస్తుంది. 

అన్నీ చూడండి

భార్యాభర్తలు చంపుకోవడం ఫ్యాషన్.. మేడ మీద నుంచి తోసేసి.. నరాల్లో హార్పిక్ ఎక్కించి..?

జగన్ ప్రభుత్వంపై పోరాడటానికి రూ. 25 కోట్లు ఖర్చు చేసా: జడ శ్రావణ్, వీడియో

శ్రీలంక నెగోంబో జైలులో అల్లర్లు... 25కి చేరిన ఖైదీల సంఖ్య

కరూర్ తొక్కిసలాట పిటిషన్‌.. అత్యవసర విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అనుమతి

Monsoon fury: దేశంలో కురిసిన భారీ వర్షాలు.. 45 శాతం నుండి 28కి తగ్గిన వర్షపాత లోటు

అన్నీ చూడండి

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments