వర్షాకాలం, శీతాకాలంలో అల్లంను ఎందుకు వాడాలో తెలుసా?

సోమవారం, 5 నవంబరు 2018 (10:07 IST)
వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ రెండు సీజన్‌లలో అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. లేకుంటే అనారోగ్య రుగ్మతలు తప్పవు. రోజూ వంటకాల్లో అల్లాన్ని చేర్చడం ద్వారా కడుపు ఉబ్బరం, కడుపునొప్పి దూరమవుతుంది. ఇందులోని జింజరాల్ అనే ఔషధ గుణం శరీర ఉష్ణోగ్రతని అదుపులో వుంచుతుంది. ఇంకా జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 
 
గుండె జబ్బులు, కండరాల నొప్పులను అల్లం నివారిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు మోతాదుకి మించి తీసుకోకూడదు. రోజుకి ఒక గ్రాముకి మించి అల్లాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు. అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
వేడినీటిలో అల్లం ముక్కలు వేసి పది నిమిషాలు మరిగించి రెండు లేదా మూడు తేనె చుక్కలు వేసుకొని రోజుకి మూడుసార్లు తీసుకుంటే జలుబు మాయమవుతుంది. నీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పగిలిన పాదాలను అందులో వుంచితే ఉపశమనం ఉంటుంది. అల్లం మధుమేహాన్ని, గుండె జబ్బుల్ని నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments