Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరూ విధిగా చేయించుకోవాల్సి వైద్య పరీక్షలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల

Written By pnr
Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:34 IST)
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచన చేస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జాబితాను త్వరలోనే విడుదల చేసింది. ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ ప్రతి యేడాది విధిగా చేసుకోవాలని కోరుతోంది.
 
ప్రభావవంతమైన చికిత్సకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ తొలి అడుగు. వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ ఒక్కరూ వైద్యసేవల కొరత వల్ల ప్రాణాలు కోల్పోరాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్ అంటున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా టైప్-2 మధుమేహం ఉన్న వృద్ధుల్లో 46 శాతం మందిని గుర్తించడం లేదన్నారు. హెచ్ఐవీ, టీబీ తరహా ఇన్ఫెక్షన్ వ్యాధులకు ఆలస్యంగా వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల అవి మరింత వ్యాప్తిచెంది ప్రమాదకర పరిస్థతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ అనారోగ్య పరిస్థితులను గుర్తించేందుకు నిర్వహించాల్సిన 58 పరీక్షలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీటన్నింటికీ కలిపి ఓ కనీస ప్యాకేజీగా రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 
 
హెచ్ఐవీ, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి, సి, హ్యుమన్ పాపిలోమా వైరస్, సిఫిలిస్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇందులో ఉన్నాయి. తప్పనిసరి వైద్య పరీక్షల జాబితాలో ఉన్న పరీక్షల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే విడుదల చేసింది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ

ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్‌ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం

సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారు.. కుట్ర కోణం ఎక్కడుంది : జగన్

జగన్ శ్రీకాకుళం పర్యటన : మహిళా ఎస్ఐతో వైకాపా నేతల అసభ్య ప్రవర్తన

బెంగాల్ బస్సు కండక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు - కౌంటింగ్ మిషిన్లతో నోట్ల లెక్కింపు

అన్నీ చూడండి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నాం : మంచు విష్ణు

ది మేజ్ నుంచి నన్నే నన్నే.. అనే మెలోడీ సాంగ్ ను ఆవిష్కరించిన ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments