ప్రతి ఒక్కరూ విధిగా చేయించుకోవాల్సి వైద్య పరీక్షలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల

Written By pnr
Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:34 IST)
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచన చేస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జాబితాను త్వరలోనే విడుదల చేసింది. ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ ప్రతి యేడాది విధిగా చేసుకోవాలని కోరుతోంది.
 
ప్రభావవంతమైన చికిత్సకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ తొలి అడుగు. వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ ఒక్కరూ వైద్యసేవల కొరత వల్ల ప్రాణాలు కోల్పోరాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్ అంటున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా టైప్-2 మధుమేహం ఉన్న వృద్ధుల్లో 46 శాతం మందిని గుర్తించడం లేదన్నారు. హెచ్ఐవీ, టీబీ తరహా ఇన్ఫెక్షన్ వ్యాధులకు ఆలస్యంగా వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల అవి మరింత వ్యాప్తిచెంది ప్రమాదకర పరిస్థతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ అనారోగ్య పరిస్థితులను గుర్తించేందుకు నిర్వహించాల్సిన 58 పరీక్షలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీటన్నింటికీ కలిపి ఓ కనీస ప్యాకేజీగా రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 
 
హెచ్ఐవీ, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి, సి, హ్యుమన్ పాపిలోమా వైరస్, సిఫిలిస్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇందులో ఉన్నాయి. తప్పనిసరి వైద్య పరీక్షల జాబితాలో ఉన్న పరీక్షల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే విడుదల చేసింది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

మహిళను ఈడ్చుకెళ్తూ బైకు నడుపుతావట్రా.. హెల్మెట్ తీసి పిడిగుద్దులు..

అన్నీ చూడండి

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం శ్రీ శ్రీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments