వరల్డ్ ఎగ్ డే: ఆరోగ్య ప్రదాత... రుచికరం..

"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గు

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:53 IST)
"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ఎగ్గేరియన్స్ పెరిగిపోతున్నారు. 
 
ప్రస్తుతం నానాటికీ కాయకూరల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలన్నా జేబుకు చిల్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ ధరకు ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థంగా గుడ్డు పేరుగడించింది. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిన పనిలేదని పెద్దలతో పాటు వైద్యులు చెబుతుంటారు. 
 
గతంలో సఘటున ఒక వ్యక్తి సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు లాగిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. రెస్టారెంట్ల నుంచి… బజ్జీ బండ్ల వరకు.. బేకరీల్లో కూడా ఎగ్టేస్ట్ దొరుకుతుంది. కేకుల్లో కూడా ఎగ్స్ వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఎగ్గుని తినేవారిలో తమిళనాడు వారు ముందుండగా… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేసులో ఉంది. మన రాష్ట్రం నాలుగో ప్లేసులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎగ్స్‌ను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చెపుతోంది.
 
ఇక గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు కూడా ప్రతీ ఏటా కొత్త ఫలితాలను ఇస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాయి. ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకోవడం వల్ల బాడీ ఎదుగుదలకు, కంటిచూపు మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్స్‌ను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అనేది వైద్యుల మాట. ఎగ్గుతింటే ఎనర్జిటిక్‌గా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments