Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినగానే కడుపు ఉబ్బరంగా వున్నట్లనిపిస్తుంది, ఎందుకు?

Written By సిహెచ్
Updated: శనివారం, 16 అక్టోబరు 2021 (21:40 IST)
కడుపు ఉబ్బరం.. అదే గ్యాస్ట్రిక్ సమస్య. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంగా పెద్ద అనారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు వంటింట్లో దొరికే దినుసులతోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అల్లంపొడి, వాముపొడి, కాస్త ఉప్పు.. ఈ మూడింటినీ నిమ్మరసంలో కలిపి గోరువెచ్చని నీటితో సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.
 
ఇలాకాకపోతే యాలకుల పొడి, ఇంగువ, శొంఠి, చక్కెర, ఉప్పుల మిశ్రమాన్ని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. ఇంకా మరొక పద్ధతి కూడా ఉంది. యాభై గ్రాముల చొప్పున సోంపు, శొంఠి, పచ్చి జీలకర్ర, పటికబెల్లం వేరువేరుగా పొడులు కొట్టుకొని వేరువేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం చేశాక... అన్ని పొడులు కలిపి ఒక స్పూను పొడిని నీటిలో వేసుకుని తాగాలి.
 
దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఇవన్నీ చేసుకునే తీరిక లేకపోతే ఆయుర్వేద ముందుల దుకాణాల్లో హింగ్వాష్టక చూర్ణం దొరుకుతుంది. ఒక స్పూను పొడిని అన్నం తినేప్పుడు తొలిముద్దలో పెట్టుకుని ఆరగిస్తే మరీ మంచిది.
 
ఇవన్నీ చేస్తునే పొద్దున్నే నడక తప్పనిసరి చేయాలి. వేపుళ్లు, పచ్చళ్లు, నూనెలో వేగించిన మాంసాహారం, అధిక మసాలాలు తినడం, శీతల పానీయాలు, పదేపదే కాఫీలు తాగడం మానేయాలి. అప్పుడే గ్యాస్ట్రిక్ నుంచి విముక్తి దొరుకుతుంది.

అన్నీ చూడండి

ఆగష్టు 18, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుందంటే?

మెడలో తాళి కడుతుండగా ఆపండి అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు

రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య

Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్

చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..

అన్నీ చూడండి

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments