తినగానే కడుపు ఉబ్బరంగా వున్నట్లనిపిస్తుంది, ఎందుకు?

శనివారం, 16 అక్టోబరు 2021 (21:38 IST)
కడుపు ఉబ్బరం.. అదే గ్యాస్ట్రిక్ సమస్య. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంగా పెద్ద అనారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు వంటింట్లో దొరికే దినుసులతోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అల్లంపొడి, వాముపొడి, కాస్త ఉప్పు.. ఈ మూడింటినీ నిమ్మరసంలో కలిపి గోరువెచ్చని నీటితో సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.
 
ఇలాకాకపోతే యాలకుల పొడి, ఇంగువ, శొంఠి, చక్కెర, ఉప్పుల మిశ్రమాన్ని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. ఇంకా మరొక పద్ధతి కూడా ఉంది. యాభై గ్రాముల చొప్పున సోంపు, శొంఠి, పచ్చి జీలకర్ర, పటికబెల్లం వేరువేరుగా పొడులు కొట్టుకొని వేరువేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం చేశాక... అన్ని పొడులు కలిపి ఒక స్పూను పొడిని నీటిలో వేసుకుని తాగాలి.
 
దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఇవన్నీ చేసుకునే తీరిక లేకపోతే ఆయుర్వేద ముందుల దుకాణాల్లో హింగ్వాష్టక చూర్ణం దొరుకుతుంది. ఒక స్పూను పొడిని అన్నం తినేప్పుడు తొలిముద్దలో పెట్టుకుని ఆరగిస్తే మరీ మంచిది.
 
ఇవన్నీ చేస్తునే పొద్దున్నే నడక తప్పనిసరి చేయాలి. వేపుళ్లు, పచ్చళ్లు, నూనెలో వేగించిన మాంసాహారం, అధిక మసాలాలు తినడం, శీతల పానీయాలు, పదేపదే కాఫీలు తాగడం మానేయాలి. అప్పుడే గ్యాస్ట్రిక్ నుంచి విముక్తి దొరుకుతుంది.

అన్నీ చూడండి

పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన లేడీ డాక్టర్... తర్వాత...

నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నారు.. నేడు వరుసగా జైలుకు..

చేపల కూర సరిగా చేయలేదని భార్యను తిట్టిన భర్త... తర్వాత ఏం జరిగిందంటే...?

ప్రభుత్వ ఉద్యోగిగా రూ. 3 కోట్లు ఆర్జిస్తే, కుట్టుపని చేసి అతడి భార్య రూ. 8 కోట్లు సంపాదించిదట?!!

వెనిజులా తరహాలో ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్

అన్నీ చూడండి

Allu Aravindఫ దీవాన చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - అల్లు అరవింద్

సింగీతం శ్రీనివాస రావు చిత్రపరిశ్రమ ఆస్తి - నిధి : మెగాస్టార్ చిరంజీవి

Sailaja Reddy: అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం టీజర్ రిలీజ్

Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్

తర్వాతి కథనం
Show comments