కరోనావైరస్ నుంచి పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది, అదెలాగంటే? (Video)

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 17 జులై 2020 (23:32 IST)
భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడటంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం.
 
ఇలా చేయడం ద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం ఆ ఆచారం వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సత్యం. ఇంటిలోను, బావులు మొదలగు తేమ ప్రాంతాల్లో పని చేసే స్త్రీల పాదాలకు క్రిములు సంక్రమించకుండా పసుపు రాసుకునేవారు. మరలా మన పూర్వ సంప్రాదాయాలను గుర్తు తెచ్చుకునే పరిస్థుతులు ఏర్పడ్డాయి. కరోనావైరస్ నుంచి కూడా పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది.
 
అది ఎలాగో తెలుసుకుందాం...
 
1. వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనివ్వాలి. ఆనీటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. మనం ఎక్కువగా శానిటైజర్లు వాడవలసి పరిస్థితులు వచ్చాయి. ఇవి పడని వారికి అరచేతులు మంటలు వస్తాయి. అలాంటి వారు ఈ నీటిని ఉపయోగించుకోవాలి.
 
2. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపు పొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు, దగ్గు లాంటివి నివారింపబడతాయి.
 
3. పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
 
4. ఇస్నోఫిలియా వ్యాధికి విరుగుడు చెపుతుంది పసుపు. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్ఛమైన తేనె వేసి రోజుకి మూడుసార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
5. ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి అర్థగంట ముందు పావు స్పూను పొడిని అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు 
తగ్గుతాయి.
 
6. పైన చెప్పిన వాటిని పాటించడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధిక శక్తి పెరగటం వలన కరోనావైరస్ మనకు దూరంగా ఉంటుంది.
 

అన్నీ చూడండి

SATకు ఎంపికైన ఏకైక బాలిక.. వడ్రంగి కుమార్తె అదరగొట్టింది..

ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు

ఢిల్లీని వణికిస్తున్న కాక్రోచ్ పార్టీ : మెట్రో స్టేషన్లు మూసివేత

నీట్ పేపర్ లీక్.. ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు.. ప్రధాని మోదీ

కారు-బైక్ ఢీ, ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు, వీడియో

అన్నీ చూడండి

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

మనకెందుకులే అని దాటవేసే మనస్తత్వాన్ని వీడండి : మంచు లక్ష్మి పిలుపు (Video)

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

తర్వాతి కథనం
Show comments