Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారాన్ని నెమ్మదిగా నమిలి.. ఆస్వాదిస్తూ తినాలి.. లేదంటే...

కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో... ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేటు ఖాళీ చేసేస్తారు. పక్కవాళ్లు పది ముద్దలు కూడా తినక ముందే మొత్తం ముగించేసే ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు.

Written By pnr
Updated: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:51 IST)
కొందరు భోజనం ముందు కూర్చుంటారో లేదో... ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వేగంగా ప్లేటు ఖాళీ చేసేస్తారు. పక్కవాళ్లు పది ముద్దలు కూడా తినక ముందే మొత్తం ముగించేసే ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి, ఆస్వాదిస్తూ తినాలి. ఎందుకంటే వేగంగా తినే వారికి ఎంత తిన్నా కడుపు నిండిన భావనే కలగదు. ఎందుకో చూద్దాం.
 
మన కడుపు ఖాళీగా ఉందా? నిండిందా? వంటి సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు ఒక వ్యవస్థ ఉంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి వేస్తోందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తుంది. మనం ఆహారం తీసుకోవటం మొదలుపెట్టి కడుపు నిండగానే.. ఆకలి తగ్గిందనే విషయాన్నీ పంపిస్తుంది. 
 
ఈ సమాచారం మెదడుకు చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అయితే గబగబా తినేవారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండినా ఆకలి తగ్గిందన్న భావన కలగక... తృప్తి అనిపించక.. ఇంకా తినేస్తూనే ఉంటారు. ఫలితంగా అవసరాన్ని మించి ఎక్కువ తినటం, బకాయం బారినపడటం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. 
 
ఇలా ఆబగా తినే అలవాటు చాలా వరకూ చిన్నతనంలోనే అలవడుతుంది. ఇది పెద్దయ్యాకా కొనసాగుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పట్నుంచే నెమ్మదిగా, బాగా నమిలి, ఆస్వాదిస్తూ తినటం నేర్పించాలి. దీనివల్ల తక్కువే తిన్నా.. తృప్తి కలుగుతుంది. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

ఇండియాలో చేరనున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి?

లంచాలను ఈఎంఐల తరహాలో చెల్లించారు : డీఎంకేపై సీఎం విజయ్ ఫైర్

బీఆర్ఎస్ కార్యకర్తలు బంగారు గొలుసు చోరీ చేస్తారని హరీశ్ రావు ఏం చేశారో చూడండి (వీడియో)

KCR: త్వరలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశం వుందా?

తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

అన్నీ చూడండి

Ilaiyaraaja : ఇళయరాజా సంగీతంతో మంజనతి షూటింగ్ ప్రారంభం

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ తర్వాత ఫైనల్ సెమిస్టర్' కూడా వుంటుంది : ఆదిత్య హాసన్

మళ్లీ చిక్కుల్లో జయం రవి.. కెనీషాతో డ్రగ్స్ వీడియో వైరల్

Folk dancer Madhuri.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఏమైంది?

S.S. Rajamouli: టైంట్రావెల్, తండ్రీ కొడుకుల కథగా వారణాసి : రాజమౌళి

తర్వాతి కథనం
Show comments