Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక

Written By ఎంజీ
Updated: బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:25 IST)
కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనాలు రూపొందించింది.

అయితే భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకుంటున్న బ్రిటన్.. భారతీయులపై ఇలాంటి వివక్షాపూరిత విధానాలను మొపడం ఎంత మాత్రం సబబు కాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్వారంటైన్ విధానంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది.

యూకే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదని కూడా హెచ్చరించింది. సమస్య పరిష్కారానికి బ్రిటన్ నుంచి త్వరితగతిన హామీ రావాలని తాము కోరినట్లు, ఈ విషయమై తగిన హెచ్చరిక కూడా చేసినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.

విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కోవిడ్ నిబంధనల గురించి బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 4వ తేదీ నుంచి బ్రిటన్ వచ్చే భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ నిబంధనలు జారీ చేసింది.

అన్నీ చూడండి

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments