ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్.. ఇప్పటికి అక్కడ మాత్రమే..

శనివారం, 26 అక్టోబరు 2019 (11:24 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్‌బుక్‌ల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, ప్రస్తుతానికి ఈ న్యూ ఫీచర్ భారత్‌లో అందుబాటులోకి రాలేదు. కేవలం అమెరికాలోని ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం, పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకునిరానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. 
 
మరోవైపు, స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్‌బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments