గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (11:01 IST)

బీహార్ పోల్ :: జేడీయు - బీజేపీల మధ్య ఫిప్టీ - ఫిప్టీ ఫార్ములా

బీహర్ రాష్ట్ర శాసనసభకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. తాజాగా అధికార ఆర్జేడీ, బీజేపీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కివచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా జేడీయూ 122, బీజేపీ 121 సీట్లల్లో పోటీ చేయనున్నాయి.
 
జితన్‌ రామ్ మంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి జేడీయూ కోటాలో సీట్లు ఇవ్వనున్నారు. కేంద్రం మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌‌జనశక్తి పార్టీకి బీజేపీ పలు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితిశ్ కుమార్, పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు మధ్య వచ్చిన విభేదాలు ఆ కూటమిని కాస్త ఇరుకున పెట్టేలా ఉన్నాయి.
 
కాగా, మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగునున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడవుతాయి. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.