1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Govt Eases Corona Vaccination Status Guidelines for International Passengers

అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై ఆంక్షలు సడలింపు

flight
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు వ్యాక్సినేషన్ నిబంధనలతో పాటు హామీ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తాజా నిర్ణయం ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకిరానుంది. 
 
నిజానికి భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్‌లైన్ ఫాం ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తమ కోరానా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తదితర వివరాలను నింపాల్సి వుంది. ఇపుడు ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.
 
ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ అంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచంతో పాటు భారత్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున్న వల్ల అంతర్జాతీయ ప్రయాణికులు మార్గదర్శకాలు సవరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ సోదాలు