శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (16:45 IST)

భర్తను హత్యచేసింది.. వంటింట్లో పాతిపెట్టి ఎప్పటిలాగానే హాయిగా వంట చేసుకుని?

సామాజిక మాధ్యమాల ప్రభావం, స్మార్ట్ ఫోన్ల వ్యవహారంతో మానవులు ఉన్మాదులుగా మారిపోతున్నారు. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ భర్తను పొట్టనబెట్టుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అఘాయిత్యానికి పాల్పడింది.

కట్టుకున్న భర్తను దారుణంగా చంపిన ఆమె వంటగదిలోనే పాతి పెట్టి ఎప్పటిలాగే వంటచేసుకుంటూ జీవిస్తున్న మహిళను మధ్యప్రదేశ్ పోలీసులు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... అనుప్పూర్ జిల్లాలోని కరోండి గ్రామానికి చెందిన మహేష్ బన్వాల్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రమీళతో ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ క్రమంలోనే మహేష్ సోదరుడు గంగారంతో ప్రమీలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరి అక్రమ సంబంధానికి మహేష్ బన్వాల్ అడ్డు వస్తున్నాడని అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే మహేష్‌ను అక్టోబర్ 22వ తేదీన చంపేశారు. ఇంకా భర్త కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రమీలపై మహేష్ సోదరుడు అర్జున్ బన్వాల్‌కి అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమీల ఇంటిని తనిఖీ చేస్తున్నసమయంలో, వంటగదిలోంచి దుర్వాసన రావడంతో అనుమానంతో అక్కడ తవ్విచూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేశ్ శవాన్నిగుర్తించి వెలికి తీశారు.

అనంతరం ప్రమీళ, గంగారం వద్ద జరిపిన విచారణలో మహేష్‌ను హత్య చేసి వంటింట్లోనే పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. నెలపాటు వంటింట్లో భర్త శవాన్ని పాతిపెట్టి అక్కడే వంట వండుకుని తినినట్లు ప్రమీళ పోలీసులతో తెలిపింది.