తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట తీర్పునిచ్చారు. తిరు ఓ.పన్నీర్ సెల్వం అట్ సీఎంవో తమిళనాడు పీపుల్స్ సర్వే పేరుతో ట్విట్టర్ ఖాతాలో దీన్ని నిర్వహించారు. ఈ ట్విట్టర్ ఖాతాను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తోంది.
ఇందులో "తమిళనాడుకు నాయకత్వం వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలా?" అంటూ ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు భారీగా స్పందించారు. ఏకంగా 95 శాతం పన్నీర్ సెల్వంకు ఓటు వేశారు. కేవలం 5 శాతం మంది మాత్రమే పన్నీర్ సెల్వం సీఎంగా ఉండరాదని తీర్పునిచ్చారు. కాగా, ఈ సర్వేలో సుమారు 50 వేల మంది పాల్గొన్నారు.
అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్కే తమ ఓటు వేశారు. ‘సీఎంవో తమిళనాడు’ పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్సెల్వం ట్విటర్ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.