ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (11:50 IST)

నాలుగేళ్ల చిన్నారిపై దారుణం.. అత్యాచారం, హత్య.. కుక్కలు కొరుక్కుని..

యూపీలో నాలుగేళ్ల చిన్నారిపై దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు దుండగులు. యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్‌లోని తన ఇంటి ముందు ఆడుకుంటుంది. 
 
కానీ కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. వారితో పాటు గ్రామస్థులు కూడా వెతికారు. అయితే పొలంలో ఓ కుక్కల గుంపు వుండటం చూశారు. అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. 
 
బాలిక మృతదేహాన్ని కుక్కలు కొరుక్కు తింటున్నాయి. ఆ శవాన్ని తన కుమార్తెగా గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఆడుకుంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఆపై వేరొక వ్యక్తి సాయంతో చంపేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ చిన్నారిని దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.