నోరూరించే చేపల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

మంగళవారం, 22 జనవరి 2019 (19:07 IST)
మాంసాహార ప్రియులు నోరూరించే చేపల కూర అంటే అమితంగా ఇష్టపడతారు. అదే చేపల బిర్యానీ అంటే... లొట్టలెయ్యాలసిందే మరి. ఆరోగ్యపరంగా చూసినా చేపలలో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. చేపలలో కాల్షియం, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వలన ఎముకలకు బలం, కంటిచూపు మెరుగుపడుతుంది. మరి చేపల బిర్యానీ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బాస్మతిబియ్యం- అరకిలో,
బిర్యానీ దినుసులు- తగినన్ని,
చేపముక్కలు- ముప్పావుకిలో,
నూనె- వంద గ్రాములు,
టొమాటోలు- నాలుగు,
ఉల్లిపాయలు- నాలుగు,
అల్లంవెల్లుల్లి- 2 టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం- టేబుల్ స్పూను,
పెరుగు- గిలకొట్టినది కప్పు,
పచ్చిమిర్చి- పది,
కొత్తిమీర- ఒక కట్ట,
ఉప్పు- తగినంత,
 
తయారీ విధానం... 
చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో సగం పెరుగు, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలి. బియ్యం కడిగి అరగంట సేపు నాననివ్వాలి. నానబెట్టిన బియ్యంలో ఉప్పు, బిర్యానీ దినుసులు, తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి.
 
మరో బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. టొమాటో ముక్కలు, మిగిలిన పెరుగు, కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషములు వేయించాలి. మసాలా పట్టించిన చేప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం మంట మీద వేసి ఉడికించాలి.
 
ఇప్పుడు పాన్‌లో అడుగున కాస్త నూనె వేసి ఉడికించిన అన్నం కొద్దిగా పరిచి దాని మీద కాస్త చేపలకూర, కాస్త కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన కాసిని ఉల్లి ముక్కలు చల్లాలి. దానిమీద మళ్లీ అన్నం పరిచి మిగిలిన కూర మిశ్రమం, కొత్తిమీర తురుము, వేయించి ఉంచిన ఉల్లిముక్కలు చల్లాలి. దాని మీద మిగిలిన అన్నం వేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టి సిమ్‌లో ఆవిరి పోకుండా పావుగంట సేపు ఉడికించి దించాలి. అంతే.. నోరూరించే చేపల బిర్యానీ రెడీ.  

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments