మృగశిర కార్తె వచ్చేసింది.. కొరమీను కూర ఇలా ట్రై చేయండి..

బుధవారం, 8 జూన్ 2022 (19:43 IST)
కావలసిన పదార్థాలు 
కొరమీను చేపలు - అరకేజీ, 
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, 
ఉల్లిపాయ - ఒకటి, 
ఉప్పు - రుచికి తగినంత, 
పసుపు - అర టీస్పూన్‌, 
కారం- రెండు టీస్పూన్లు, 
నూనె - సరిపడా, 
కరివేపాకు - కొద్దిగా, 
కొత్తిమీర - ఒకకట్ట.
ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు
జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 
మెంతిపొడి - అర టీస్పూన్‌, 
చింతపండు - యాభై గ్రాములు
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కలను కాస్త కారం, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. ఒక బౌల్‌లో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి.
 
ఆపై ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేగాక, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. 
 
తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత సిద్ధం చేసుకున్న చింతపండు రసం మిశ్రమాన్ని చేర్చి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీలా తయారయ్యాక 
 
కొర్రమీను ముక్కలు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. అంతే కొరమీను గ్రేవీ రెడీ.

అన్నీ చూడండి

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments