అక్షయ తృతీయ రోజున మంచి నీటిని దానం చేయాలట..

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:57 IST)
వైశాఖ శుద్ధతదియనాడు చేసే ఏవ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయవౌతుంది. అక్షయతృతీయ’ రోజున ఏది ఇంటికివచ్చినా అది అక్షయంగా పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. వీలైనంతవరకూ దానధర్మాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. 
 
ముఖ్యంగా మంచి నీటిని దానం చేయాలని అంటున్నాయి. అలాగే శెనగలు, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వాలని చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఈ జన్మలోనే కాదు వచ్చేజన్మలోను మంచినీటికి ఆహారానికి ఎలాంటి కొరత ఉండదట. రానున్న జన్మలు ఎలాంటివైనా.. మంచినీటికోసం ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం రాదని స్పష్టం చేస్తున్నాయి. 
 
అందువలన అక్షయ తృతీయ రోజున మంచి నీటిని ఆహార ధాన్యాలను దానం చేయటం మరిచిపోకూడదు. అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపు రంగు చీర లేదాఎరుపు రంగు వస్తువులు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

నువ్వు పిచ్చివాడివి, నేనే లేకుంటే నువ్వు జైల్లో వుండేవాడివి: నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం

భారతీయ పర్యాటకుల అనుచిత ప్రవర్తన.. వీసా నిబంధనలు కఠినతరం కావొచ్చు : అరుణ్ బోత్రా

అన్నీ చూడండి

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

తర్వాతి కథనం
Show comments