శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం...

ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగొందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వ

శనివారం, 4 ఆగస్టు 2018 (12:08 IST)
ఒక వైపున ఆధ్యాత్మిక సంపద, మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగందుతూ ఉంటాయి. అలాంటి ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన పుణ్యక్షేత్రంగా కడప జిల్లాలో దర్శనమిస్తుంటారు ఆంజనేయస్వామివారు. కడప జిల్లాలోని ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. దేవాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలు గతవైభవానికి నిదర్శనమై నిలుస్తుంటాయి.
 
పూర్వం ఇక్కడ హనుమంతుని ఆలయం మాత్రమే ఉండేది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రదేశంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా ఉంటే బాగుంటుందని భావించిన ఓ భక్తుడు, ఆ స్వామి గురించి అదే పనిగా ధ్యానం చేసేవాడు. ఆ భక్తుని విన్నపం మేరకు లక్ష్మీ సమేతుడై స్వామి ఇక్కడికి ఆవిర్భవించారు.
 
ఆనాటి నుండి లక్ష్మీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య పాత్రను పోషించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామివారు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉండగా, పద్మావతి అమ్మవారు గోదాదేవి ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తుంటారు.
 
శ్రీ వేంకటేశ్వర స్వామి సైన్యాధిపతి అయిన విష్వక్సేనుల వారు కూడా ఈ ఆలయ పూజలను అందుకుంటుంటారు. తిరుమల బాలాజీకి అనుకున్న మెుక్కులను, వీలునుబట్టి ఈ క్షేత్రంలో చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించడం వలన దారిద్య్రం, దుఃఖం నశించి, సిరిసంపదలు, సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

అన్నీ చూడండి

జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

అన్నీ చూడండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

తర్వాతి కథనం
Show comments