తెలంగాణాలో మే నెలలో టెన్త్ పరీక్షా ఫలితాలు

శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, త్వరలోనే పదో తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకుంటుంది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. 
 
ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తే మాత్రం టెన్త్ పరీక్షలు మే 11 లేదా మే 12వ తేదీల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలోనే నిర్వహించేందుకు అధికారులు నవంబరు నెల నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ, కానీ, ఇంటర్ పరీక్షలను ముందు నిర్వహించాల్సి రావడంతో టెన్త్ పరీక్షలను మే నెలలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, మే నెలలో ఈ టెన్త్ పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. 

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments