హనుమంతుడు అక్కడే వుంటాడు

Written By జయ
Updated: గురువారం, 4 జూన్ 2026 (22:53 IST)
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. అంటే, ఎక్కడెక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుందో, అక్కడ హనుమంతుడు రెండు చేతులు జోడించి, ఆనంద బాష్పాలతో మైమరిచి కూర్చుని ఉంటాడట. అందుకే ప్రతి రామ భక్తుడి హృదయంలో ఆంజనేయుడు కొలువై ఉంటాడు. 
 
శ్రీరాముడు వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుడిని భూమిపైనే ఉండి ధర్మాన్ని రక్షించమని కోరాడు. అప్పటి నుండి హనుమయ్య హిమాలయాలలోని గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటూ నివసిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ కొందరు యోగులకు అక్కడ ఆయన దర్శనం కలుగుతుందని చెబుతుంటారు.
 
ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్న జెండా మీద నివసించాడు. అందుకే ఆ రథాన్ని 'కపిధ్వజం' అంటారు. యుద్ధం మొత్తం పాండవులకు రక్షణ కవచంలా ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రావణ సంహారం తర్వాత విభీషణుడు లంకకు రాజయ్యాడు. పరమ రామ భక్తుడైన విభీషణుడికి తోడుగా ఉంటూ, రామకథను ప్రచారం చేస్తూ కొంతకాలం లంకలో కూడా హనుమంతుడు నివసించారని పురాణాలు చెబుతున్నాయి.
 
ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే నిజాయితీ, నిస్వార్థ సేవ ఉంటాయో అక్కడ హనుమంతుడు ఉంటాడు. మనం "హనుమాన్ చాలీసా" పఠించినప్పుడు మనలో కలిగే ఆ అపారమైన ఆత్మవిశ్వాసమే హనుమంతుడి ఉనికికి నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాముడు లేని చోట హనుమంతుడు ఉండడు.. హనుమంతుడు లేని చోట విజయం ఉండదు.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

తర్వాతి కథనం
Show comments