కార్తీక మాసం చివరి సోమవారం... కార్తీక పుణ్యస్నానం చేస్తే...

Written By సిహెచ్
Updated: శనివారం, 27 నవంబరు 2021 (23:16 IST)
పరమేశ్వరుని ఆరాధనకు తెల్లవారు జామున స్నానం చేయాల్సిందే. లేకుంటే పూజా మందిరంలో ప్రవేశించకూడదని పెద్దలు, పండితులు చెబుతారు. ప్రతి రోజూ నియమానుసారం స్నానం చేస్తే.. ఆయుష్షు పెరుగుతుందనేది నమ్మకం. మన చెంతనే ఉన్న నదీలో కార్తీక స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

 
ఇక కార్తీక సముద్ర స్నానాలు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. కార్తీకమాసంలో చంద్రకిరణాల రూపంలో అమ్మవారు నీటిని అమృతధారగా మార్చి ఆశీర్వదిస్తుందనేది అందరి నమ్మకం. నదిలో మూడుసార్లు మునిగితే..శరీరమంతా చంద్రకిరణ అమృత స్పర్శతో తేజోవంతమవుతుంది. ఔషధ శక్తి వచ్చి..అనారోగ్యం కలగదని పెద్దలంటారు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చిత్తశుద్ధిలేని శివపూజలేలరా..అన్నట్టు మనం చేసేదైమైనా చాలా మనసులగ్నం పెట్టి చేసి తీరాల్సిందే.

 
నదీ స్నానం సందర్భంగా ఒంటిపై వస్త్రం ఉంచుకుని...ఒక సత్సంకల్పంతో స్నానమాచరిస్తే తగిన కార్తీక పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. అది మానవులకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా నదీ స్నానంతోనే పుణ్య కార్యం అయిపోయిందనుకోకూడదు. తోచనంతగా ధానధర్మాలు చేస్తేనే తగిన పుణ్యం వస్తుంది. అందుకే కార్తీకస్నానాలతోపాటు భక్తజనమంతా శివపూజలు, అభిషేకాలు, ధానధర్మాలు చేస్తే.. భక్తిఫలం దక్కుతుంది. సర్వజయం సిద్ధిస్తుంది.

అన్నీ చూడండి

ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ మహిళా ఎంపీ మద్దతు - కుమార్తె మాత్రం కాక్రోచ్ పార్టీకి సపోర్టు

వైఎస్ షర్మిలకు ఏమైంది? త్వరగా కోలుకోవాలంటున్న బాబు, పవన్, లోకేశ్

ఇకపై క్రియాశీలక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య

గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు

పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

తర్వాతి కథనం
Show comments