సంబంధిత వార్తలు
- రాజధాని అమరావతి పిటిషన్లపై నేటి నుంచి రోజువారి విచారణ
- ఏపీలో మొదలైన మున్సిపల్ - కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్
- చెప్పులు లేనివాళ్లు కూడా రాష్ట్రపతి భవన్లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా
- సినిమా టిక్కెట్ల ధర తగ్గింపుపై కోర్టుకెక్కం.. ఏపీ సీఎం జగన్తో చర్చిస్తాం : డీవీవీ దానయ్య
- ఆంధ్రప్రదేశ్ నెత్తిన కొండలా రెవెన్యూ లోటు! : వెల్లడించిన కాగ్ నివేదిక
కృష్ణానదిలో పవిత్రస్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతు
కృష్ణానదిలో పవిత్రస్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు వద్ద కృష్ణానదిలో ఈ ఘటన జరిగింది.
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా కార్తీక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కృష్ణానది పాయలోకి వెళ్లి గల్లంతయ్యారు.
ఒకే గ్రామానికి చెందిన 20 ఏళ్లలోపు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్లు నీటిలో గల్లంతు అవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇప్పటివరకు ఇరువురి మృతదేహాలు లభ్యం కాగా, మరొక యువకుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
