Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా భౌతిక దేహముతో చివరిసారిగా మానవులకు ఇచ్చిన ప్రసాదము ఇదే...

సాయినాధుడు శిరిడీలో దేహంతో ఉన్న రోజుల్లో సూర్యాస్తమయమయ్యాక మశీదులో ప్రవేశించడానికి ఆడవారిని అనుమతించేవారు కాదు. లక్ష్మీబాయి షిండే అను భక్తురాలిని మాత్రమే బాబా మశీదులో సూర్యాస్తమయమయ్యాక కూడా ఉండనిచ్చేవారు. ఆమె అందరికంటే చివరగా మశీదు విడిచి ఎవరు వెడుతు

Written By chj
Updated: గురువారం, 14 జూన్ 2018 (12:35 IST)
సాయినాధుడు శిరిడీలో దేహంతో ఉన్న రోజుల్లో సూర్యాస్తమయమయ్యాక మశీదులో ప్రవేశించడానికి ఆడవారిని అనుమతించేవారు కాదు. లక్ష్మీబాయి షిండే అను భక్తురాలిని మాత్రమే బాబా మశీదులో సూర్యాస్తమయమయ్యాక కూడా ఉండనిచ్చేవారు. ఆమె అందరికంటే చివరగా మశీదు విడిచి ఎవరు వెడుతుంటే వారితో కలిసి తన ఇంటికి వెళ్లేది. సాయినాధుని మీద అంతటి భక్తివిశ్వాసాలు గలది లక్ష్మీబాయి షిండే. మరి ఈ భక్తురాలు బాబా కరుణాకటాక్షాలను ఎలా పొందిందో, బాబా సమాధి చెందే ముందు లక్ష్మీబాయికి ఇచ్చిన అత్యంత విలువైన ప్రసాదం ఏంటో తెలుసుకుందాం.
 
ప్రతిరోజు రాత్రి షిండేపాటిల్ భార్యయైన లక్ష్మీబాయిషిండే ఒక బార్లీ రొట్టె తెచ్చి బాబాకు సమర్పిస్తుండేది. అందుకు ఒక కారణమున్నది. ఒకరోజు సాయంత్రం బాబా మశీదులో ప్రహరీ గోడను ఆనుకుని నిలుచుని తాత్యాపాటిల్‌తో ఏమో చెబుతున్నారు. ఇంతలో లక్ష్మీబాయి వచ్చి పాదాభివందనం చేసింది. ఆప్పుడు బాబా... అమ్మా నాకు ఆకలిగా ఉంది అన్నారు. అయితే భోజనం తెచ్చేదా బాబా అన్నది లక్ష్మీబాయి. ఆ తీసుకురా అన్నారు బాబా. ఆమె ఇంటికి వెళ్లి నెయ్యి, పప్పుకూర, రొట్టె తెచ్చింది. సాయి వాటిని ఆత్రంగా అందుకున్నారు కానీ... వెంటనే ఆ వంటకాలన్నింటిని ఆయన ప్రక్కనే నిలుచున్న కుక్కకు పెట్టేశారు. లక్ష్మీబాయి నివ్వెరబోయి... బాబా మీకు ఆకలి వేస్తుంది కదా, మీరు కొంచమైన తీసుకోకుండా అంతా ఆ కుక్కకు వేశారే.... అన్నది. ఆ కుక్క రొట్టె తింటుంటే తృప్తిగా చూస్తూ సాయి..... అది మాత్రం ప్రాణే కదా.... దానికి ఆకలి ఉన్నది.
 
అది-నేను వేరు కాదు. అది తిన్నా, నేను తిన్నా ఒకటే అన్నారు. ఈ ఉపదేశం లక్ష్మీబాయి హృదయంపై చెరగరాని ముద్ర వేసుకున్నది. అప్పటినుండి ప్రతిరోజు సాయంత్రం ఆమె పాలల్లో నానబెట్టిన రొట్టె నియమంగా బాబాకు సమర్పించసాగింది. అది ఆమె నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. సంస్కారానికి, చదువుకు సంబంధం లేదు. సంస్కారం జన్మతః వచ్చేది. చదువు, వేషము అన్నవి మనం మధ్యలో తెచ్చిపెట్టుకున్నవి. లక్ష్మీబాయి ఇవేమి లేని పేదింట ఇల్లాలైనా, పల్లెపడుచైనా ఆమెలో ఎంతో సంస్కారమున్నది. గురువు యొక్క మనోభావమెరిగి ఆయనేమీ చెప్పకనే సకాలంలో తగిన సేవ చేయగలవారు శిష్యుల్లో ఉత్తములు. లక్ష్మీ బాయి బాబాపై శ్రద్దాభక్తులతో ఉత్తమ స్థాయిని చేరుకుంది. 
 
అందుకే బాబా మహా సమాధి చెందబోయే కొద్ది నిముషాల ముందు మశీదుకు చేరుకోగలిగింది. బాబా తమ జేబు నుండి ఒకసారి నాలుగు రూపాయి నాణాలు, తరువాత అయిదు రూపాయిల నాణాలను తీసి నవవిధ భక్తులకు సంకేతంగా ఆమెకు ప్రసాదించాడు. వీటిని నేటికి మనం శిరిడీలో దర్శించుకోవచ్చు. బాబా భౌతిక దేహముతో చివరిసారిగా మానవులకు ఇచ్చిన ప్రసాదము ఇదే... ఆమెలో అంత సంస్కారం ఉండబట్టే సూర్యాస్తమయమయ్యాక బాబా మశీదులోకి రానిచ్చారు. ఎప్పుడైనా ఆమె వంటకాలు తెచ్చి సమర్పించడం ఆలస్యమైతే అప్పటికప్పుడు ఏదో ఒకటి పెట్టనిచ్చేవారు శ్రీ సాయి. ఒక్కొక్కప్పుడు ఆమె ఇచ్చిన బిక్ష నుండి మూడు నాలుగు ముద్దలు మాత్రమే తీసుకుని మిగిలిన వంటకం లక్ష్మీబాయికి ప్రసాదంగా ఇచ్చేవారు బాబా.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments