పిడుగులు పడుతుంటే అర్జునా.. ఫల్గుణా అని ఎందుకంటారు?

Written By సిహెచ్
Updated: గురువారం, 18 జులై 2019 (21:30 IST)
పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జునా, ఫల్గుణా అని అంటారు. దాని వెనుక ఉన్ని పరమార్దం ఏమిటి? ఈ విషయం వెనుక మహాభారత గాధ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకువస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుండి దించమంటాడు. 
 
ఉత్తర కుమారుడు భయపడుతుంటే... అది చూసి అర్జునుడు, తనకు ఉన్న పది పేర్లు(అర్జునా, ఫల్గుణా, పార్ధ, కిరీటీ, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ) చెప్పి , భయాన్ని పోగొడతాడు. అప్పటి నుండి ఎలాంటి భయం కలిగినా అర్జునా, ఫల్గుణా..... అని తలుచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రధ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments