శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

ఆదివారం, 6 మార్చి 2022 (16:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

అన్నీ చూడండి

విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం, 1500 డిగ్రీల వేడితో మెటల్ లిక్విడ్, 9 మంది మృతి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సుస్థిర వ్యవసాయంపై రైతులకు హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్ అవగాహన

ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కి ప్రశ్నలు, మైక్ తీసి కింద పడేసి బూటు కాలితో తొక్కేసారు, వీడియో

మా అన్న అమెరికా వెళ్లనని చెప్పినా ఒత్తిడి చేసి పంపించాము, చంపేసారు: అన్షుల్ సోదరి తన్వి, వీడియో

ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో

అన్నీ చూడండి

09-06-2026 మంగళవారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

తర్వాతి కథనం
Show comments