శ్రీవారి ఆలయంలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Written By వరుణ్
Updated: ఆదివారం, 15 అక్టోబరు 2023 (12:32 IST)
శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఉత్సవాలు నిర్వహించేందుకు స్వామికి అనుమతి కోరుతూ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముదు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనులవారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చిపై వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగినున్నారు. 
 
రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఇక ఆలయ మాడ వీధుల్లో విశ్వక్సేనులవారి ఊరేగింపును ఆగమభాషల్లో సేనాధిపతి ఉత్సవంగా పిలుస్తారు. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఇక విత్తనాలు మొలకెత్తడాన్నే అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఘటం ఉద్దేశ్యమని అర్చుకులు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

అన్నీ చూడండి

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

తర్వాతి కథనం
Show comments