Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం స్వీట్ సమోసా... ఎలా చేయాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (22:16 IST)
సాయంత్రమయ్యేసరికి పిల్లలు రకరకాల స్నాక్స్ కావాలని, బయట దొరికేవే కావాలని గొడవ చేస్తుంటారు. బయట లభించే పదార్దాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇంట్లోనే రకరకాల స్నాక్స్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అదే స్వీట్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసాను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థములు:
జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు (చిన్నగా కట్ చేసినవి)-  1 కప్పు
కొబ్బరి కాయ-  ఒకటి(తురుముకోవాలి),
పంచదార- మూడు  కప్పులు,
మిల్క్ మెయిడ్-  1 కప్పు,
యాలుకల పొడి-  టీ స్పూన్,
మైదా- పావు కిలో,
నెయ్యి-  కప్పు,
నూనె- పావుకిలో,
 
తయారుచేయు విధానం:
మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి. పాకంలో కొబ్బరితురుము వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకల పొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి. 
 
ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి. అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారుచేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తీసివేయాలి. ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసేయ్యాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ సమోసా రెడీ.

అన్నీ చూడండి

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments