బాలానగర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:37 IST)
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడుని బాలానగర్ జలగం సాయి సత్య శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఆయన అక్కడే కాలిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది. 
 
పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

అన్నీ చూడండి

PM Modi : ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్ తో వచ్చారు : రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments