Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Written By ఠాగూర్
Updated: శనివారం, 31 జులై 2021 (12:26 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు కాలేజీలను వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాలల్లో ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
 
అయితే మంజూరు చేసిన అన్ని కాలేజీలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాగా పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మంజూరుపై ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రాన్ని రాం చరణ్ భుజాలపై మోశారు - కానీ, ఆ ఒక్కటీ లోటుంది : పరుచూరి గోపాలకృష్ణ

Paradise teaser: పారడైజన్ జాగా కోసం నాని రక్తపాతం స్రుష్టించిన టీజర్ వచ్చేసింది

Korean Kanakaraju Review : రొటీన్ ఫార్మెట్ అయినా థ్రిల్ కలిగించే కథగా కొరియన్ కనకరాజు - రివ్యూ

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments