Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై దాడి

Written By ఎంజీ
Updated: బుధవారం, 10 నవంబరు 2021 (22:06 IST)
ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

హస్తినాపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు.

శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బస్వరాజు, బాధితురాలు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వేరే వివాహం చేసుకుంటున్నానని బస్వరాజు తనపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

తనకు వివాహం ఫిక్స్ అయిందని, ఫోన్ చేయకని తాను చెప్పినా వినలేదని ఆమె చెప్పారు. గతంలో తాము ఇద్దరం ప్రేమించుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు.

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకో మగడా అంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments