పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై దాడి

Written By ఎంజీ
Updated: బుధవారం, 10 నవంబరు 2021 (22:06 IST)
ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

హస్తినాపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు.

శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బస్వరాజు, బాధితురాలు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వేరే వివాహం చేసుకుంటున్నానని బస్వరాజు తనపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

తనకు వివాహం ఫిక్స్ అయిందని, ఫోన్ చేయకని తాను చెప్పినా వినలేదని ఆమె చెప్పారు. గతంలో తాము ఇద్దరం ప్రేమించుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments