కేటీఆర్ ఓ తుపాకీ రాముడు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:04 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు."కేటీఆర్ ఓ తుపాకీ రాముడు.. అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి 32 శాతం నిధులిస్తే, ఎన్డీయే వచ్చాక 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నామని సంజయ్ తెలిపారు.

కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారని, కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సచివాలయానికి వెళ్లని వాడికి కొత్తది ఎందుకని ప్రశ్నించారు.
 
ఉద్యోగి చనిపోయిన తర్వాత, పదవీ విరమణ  తర్వాత పీఆర్‌సీ ఇస్తారా, దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు.

ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించాడన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి, కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు. 

అన్నీ చూడండి

Ram 23: రామ్ పోతినేని 23 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తిరు ఖరారు

రెండు రోజుల్లో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్

బాలన్ - ది బాయ్ ట్రైలర్ రిలీజ్ చేసి అభినందించిన అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి

Nag Ashwin: పుష్పక విమానం, మహానటి లా నిజాయితీగా సింగ్ గీతం చిత్రం తీశా : నాగ్ అశ్విన్

Warner Bros: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్

తర్వాతి కథనం
Show comments