Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్వర్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆదివారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో జరిగే ఓ శుభకార్యానికి ఓ కారులో బయలుదేరారు. 
 
వీరు ప్రయాణిస్తున్న కారు ములుగు జిల్లాలోని మంగంపేట మండల కేంద్రంలోని గంపలగూడెం మార్కెట్‌ గోడౌన్స్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ కారు వేగంగా వస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా వుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments