తెలంగాణాలో దడ పుట్టిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 6 డిశెంబరు 2021 (14:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దడపుట్టిస్తున్నారు. కొత్త కేసుల నమోదులో ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా, అనేక కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతూ కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో 25,693 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 156 మందికి ఈ వైరస్ సోకింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో 47, రంగారెడ్డిలో 12 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ వైరస్ ఏమాత్రం తగ్గించబోదని స్పష్టం చేశారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరికీ ఎలాంటి క్లిష్టమైన సమస్యలు సంభవించబోవని తెలిపారు. 

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments