ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు.. భార్య డబ్బు ఇవ్వలేదని..?

సోమవారం, 31 మే 2021 (18:28 IST)
ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట సైదాబాద్‌లోని అక్బర్ బాగ్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దిల్‌కుషా ఫంక్షన్ హాలు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మద్యం కోసం భార్యతో కొట్లాడి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతంతో వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. 
 
మృతుడు ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్యతో గొడవ పడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments