బిజెపిలోకి ఈటల- రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్

Written By ఎం
Updated: శనివారం, 1 మే 2021 (22:07 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహానికి గురైన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు బిజెపి జాతీయ నాయకత్వం ఈటెల రాజేంద్ర తో నేరుగా సంప్రదింపులు చేసినట్లు సమాచారం.

తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ఫోన్లో మంతనాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ నీ నుంచి ప్రతినిధులను ఈటల రాజేందర్ వద్దకు పంపించి మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో బలపడేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  యోచిస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీలో సీనియర్‌గా పేరుపొందిన బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను అవమానకర రీతిలో మంత్రి పదవిని లాక్కోవడంతో బలహీన వర్గాల నాయకులను అణిచి వేస్తున్నారన్న విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భూకబ్జా కేసులో ఇరికించి జైలుపాలు చేయాలనే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కుటిల పన్నాగం తిప్పికొట్టేందుకు బిజెపిలో చేరడమే శ్రేయస్కరంగా ఈటల రాజేందర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇందుకు సంబంధించిన చర్చోపచర్చలు ఈ మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధులు ఈటెల రాజేందర్‌తో మంతనాలు జరుపుతున్న సమయంలో నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రితో స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనే విషయం టిఆర్ఎస్‌కి షాక్ లాంటిదే.

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments