Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు.. ఏం పడిందో చూసి షాక్

Written By ఎం
Updated: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:18 IST)
చేపల కోసం చెరువులో వలేసిన జాలర్లు అదిరిపడ్డారు. చేపల వలలో 100 కేజీలకు పైగా బరువున్న భారీమొసలి చిక్కుకోవడంతో అందరూ షాకయ్యారు. దాన్ని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
 
చేపల వేట కోసం చెరువులోకి దిగిన ఆ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కడంతో గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంటలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా చేపలు పట్టడం కోసం ఊర చెరువులో వలలు ఏర్పాటు చేశార

బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి చిక్కుకుని కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా బరువున్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించి బంధించారు.

అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు దాన్ని స్వాధీనం చేసుకుని పాకాల సరస్సులో విడిచిపెట్టారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments