హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు

బుధవారం, 4 జనవరి 2023 (12:27 IST)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 40 కార్లలలో 20 బృందాలుగా విడిపోయిన అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో ఈ సోదాలకు జరుపుతున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను చెల్లింపుల్లో ఈ కంపెనీ భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. దీనిపై పక్కా సమాచారం సేకరించిన ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగారు. 
 
ఆ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లతోపాటు బాచుపల్లి, చందా నగరులోనూ ఏక కాలంలో ఈ సోదాలకు దిగారు. ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోకూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఏకంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోది. గత కొంతకాలంగా ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా సోదాలు జరుపుతుండం చర్చనీయాంశంగా మారింది. 

అన్నీ చూడండి

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments