Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తు కాగితాలు ఏరుకునే మహిళనూ వదలని కామాంధులు...

Updated: బుధవారం, 29 మే 2019 (09:07 IST)
కామాంధుల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిత్తుకాగితాలు ఏరుతున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. ఆమెపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన తెలంగాణలో జనగామలో కలకలం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని మండలంలోని శామీర్‌పేట జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
విచారణలో మృతిచెందిన మహిళకు 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని.. ప్రస్తుతం ఆమె భర్త మరో మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తేలింది. మంగళవారం ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. 

అన్నీ చూడండి

Ravi Teja: ఇరుముడి రెస్పాన్స్ చూస్తుంటే కళ్లు చెమర్చాయి.: మహారాజా రవితేజ

Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి

ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమాను ప్రకటించిన కిరణ్ అబ్బవరం

Tamannaah : తమన్నా భాటియా... ది వ్వాన్ ఎపిక్ ఫాంటసీ విడుదలకు సిద్ధం

Soundarya Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయనున్న సౌందర్య

తర్వాతి కథనం
Show comments