సంతానం కలగలేదని భార్యపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 23 మార్చి 2021 (22:12 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్రపోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు.ఈ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్‌ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై భార్యాభర్తలపై ఆదివారం గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్‌ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. 
 
పరశురామ్‌ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments