నల్గొండ జిల్లాలో నరబలి - గుడివద్ద తల స్వాధీనం...

Written By ఠాగూర్
Published: సోమవారం, 10 జనవరి 2022 (12:12 IST)
తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నరబలి కలకలం సృష్టించింది. ఓ ఆలయం వద్ద తలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు అక్కడు వచ్చి మొండెం లేని తలను స్వాధీనం చేసుకుని మొండెం కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ పట్టణంలోని విరాట్ నగర్ మైసమ్మ గుడి వద్ద ఈ తల కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. 
 
ఈ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చి.. తలను అక్కడే వదిలిపెట్టి మొండెంను తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆలయం వద్ద రక్తపు మడుగులో ఉన్న తలను చూడగానే భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... తలను స్వాధీనం చేసుకన్నారు. దీనిపై కేసు నమోదు చేసి మొండెం కోసం గాలిస్త్ున్నారు. ఈ నరబలి ఘటన తర్వాత స్థానికులు ఆలయానికి వెళ్ళేందుకు హడలిపోతున్నారు. 

అన్నీ చూడండి

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

మనకెందుకులే అని దాటవేసే మనస్తత్వాన్ని వీడండి : మంచు లక్ష్మి పిలుపు (Video)

తర్వాతి కథనం
Show comments