నేటి నుంచి తెలంగాణాలో టీ-శాట్ తరగతులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (08:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ తరగతులు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు జరుగుతాయని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ సర్క్యులర్‌ జారీచేసింది. 
 
ఈ సర్క్యలర్ ప్రకారం.. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు టి-శాట్‌ ద్వారా డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు టీ- శాట్ ద్వారా పాఠ్యాంశాలను బోధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గిన సంగతి తెలిసిందే. అంతకుముందు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు అందించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments