సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్: కోవా లక్ష్మీ కుమార్తె ఓటమి
ఆదిలాబాద్లోని ఆసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ తప్పలేదు. పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుమార్తె అరుణ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సరస్వతి ఈ ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్నారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గోపులాపూర్, మక్తల్ మండలంలోని చినగోపులాపూర్, వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం, ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల, మిడ్జిల్ మండలం దోనూరులో టీఆర్ఎస్ అభ్యర్థులనే విజయం వరించింది. అయితే ఆసిఫాబాద్లో టీఆర్ఎస్ గెలవకపోవడానికి కారణాలేంటనే దానిపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఏది ఏమైనా.. ఒక్క చోటైనా టీఆర్ఎస్కు షాక్ తగిలిందని.. క్రమక్రమంగా టీఆర్ఎస్ ప్రభావం తెలంగాణలో తగ్గిపోతుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు భావిస్తున్నారు.