Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాలా సీతారామన్ తో టి ఆర్ ఎస్ ఎంపీలు భేటి

Written By ఎం
Updated: గురువారం, 12 డిశెంబరు 2019 (20:45 IST)
జీఎస్టీ బకాయిలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులతో పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రి  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చర్చించారు.

ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయంలోఎంపిల బృందం కలిసింది.. ఈ సందర్భం గా జీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, . రాష్ర్టానికి రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్‌ లేఖను కేంద్ర మంత్రి కి అందజేశామని   తెలిపారు.

ఐజీఎస్టీ నిధులు రూ. 4,531 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరామని అన్నారు.  విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రూ. 450 కోట్లు రావాలని, . స్థానిక సంస్థలకు రూ. 312 కోట్లు రావాల్సి ఉందని, అలాగే . మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెప్పిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

మిషన్‌ భగీరథకు రూ. 19,205 కోట్లు, కాకతీయకు రూ. 5 వేల కోట్లు అడిగామని,  గిరిజన యూనివర్సిటీకి రూ. 450 కోట్లు విడుదల చేయాలని కోరామన్నారు.. నిధుల ఆలస్య ప్రభావం రాష్ట్ర అభివృద్ధి పనులపై పడుతుందని,   ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ  ఎంపీలు కూడా నిధులు వచ్చేలా సహకరించాలి అని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కోరారు.

అన్నీ చూడండి

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

తర్వాతి కథనం
Show comments