Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధానికి అడ్డు.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది..!

Written By సెల్వి
Updated: మంగళవారం, 29 జూన్ 2021 (12:16 IST)
వివాహేతర సంబంధానికి అడ్డొస్తానని అనుమానంతో భర్తను భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట పరిధిలో గల బోడియాతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడియాతండాకు చెందిన కున్‌సోతు రవి(35) బుధరావుపేట గ్రామానికి చెందిన దావూద్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే దావూద్‌కు రవి భార్య భారతికి ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం దావూద్‌ వద్ద రవి డ్రైవర్‌ పని మానేశాడు. అయినా భారతి ఇంటికి దావూద్ వెళ్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో రవిని హత్య చేయాలని అతని దావూద్, భారతి పథకం పన్నారు. ఏప్రిల్‌ 23న రవితో ఫుల్‌బాటిల్‌ మందు తెప్పించుకుని బుధరావుపేట గ్రామ శివారులోకి వెళ్లి మద్యం తాగాడు దావూద్. 
 
మద్యం మత్తులో ఉన్న రవిని కర్రతో దావూద్‌ బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేసి భారతికి విషయం తెలియజేసి ఇంటికి వెళ్లిపోయాడు.
 
మరుసటి రోజున మృతదేహం నీటిపై తేలియాడటాన్ని దావూద్‌కు గమనించి రెండు బండరాళ్లను కట్టి బావిలోకి వదలడంతో నీటిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా నుంచి కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఈరమ్మ ఈనెల 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

అన్నీ చూడండి

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

తర్వాతి కథనం
Show comments